కొండకోనలు దాటినా కాపాడలేకపోయారు

AP: పోలవరం జిల్లా కూనవరం మండలం కారుమానుకొండకు చెందిన సమ్మక్క ప్రియ(18) పాముకాటుకి గురైంది. కుటుంబసభ్యులు ఆమెను డోలీ ద్వారా కూటూరు గవర్నమెంట్ హాస్పిటల్కు, ఆ తర్వాత చింతూరుకు తరలించారు. అనంతరం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మంగళగిరి ఎయిమ్స్కు తరలించినట్లు యువతి తండ్రి లక్ష్మణ్రెడ్డి తెలిపారు. అక్కడ అడ్మిట్ కూడా చేసుకోకుండా వెనక్కి పంపేశారని ఆయన వాపోయారు. అనంతరం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్తే డాక్టర్స్ పట్టించుకోలేదన్నారు. అర్ధరాత్రి గిలగిలా కొట్టుకుంటూ తన కుమార్తె చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.



