మిడ్మానేరు వద్ద కార్లతో డేంజరస్ స్టంట్స్

TG: మిడ్మానేరు బ్యాక్వాటర్ వద్ద పర్యాటకుల అత్యుత్సాహం ఆందోళన కలిగిస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లి శివారులోని బ్యాక్వాటర్ను చూసేందుకు హైదరాబాద్ నుంచి సుమారు 50 వాహనాల్లో పర్యాటకులు తరలివచ్చారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అయితే కొందరు పర్యాటకులు సమీపంలోని మైదానంలో కార్లతో ప్రమాదకర విన్యాసాలు చేశారు. వేగంగా కార్లు నడుపుతూ స్టంట్స్ చేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



