భర్త చెవిలో విషం పోసిన భార్య

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా పుళుదికుడి గ్రామానికి చెందిన రవిచంద్రన్, ఉమారాణి దంపతులు. కొత్త ఇల్లు నిర్మించేందుకు రవిచంద్రన్ వివిధ వ్యక్తులు, సంఘాల నుంచి రూ.10లక్షల లోన్ తీసుకున్నాడు. లోన్ చెల్లించలేకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త చనిపోతే అప్పుల నుంచి తప్పించుకోవచ్చు అని భావించిన ఉమారాణి, రవిచంద్రన్ గాఢనిద్రలో ఉండగా అతని చెవిలో విషపదార్థం పోసింది. అస్వస్థతకు గురైన రవిచంద్రన్ అప్రమత్తమై తప్పించుకుని స్థానికుల సహాయంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.



