భూసేకరణలో స్పీడ్ పెంచాలి.. లేదంటే చర్యలు తప్పవు

TG: పారిశ్రామిక పార్కులు, ఎడ్యుకేషనల్ హబ్ల కోసం భూసేకరణపై జిల్లా కలెక్టర్లకు CM రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 30లోగా 5 వేల నుంచి 10 వేల ఎకరాల భూమి సేకరణ పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఎడ్యుకేషనల్ హబ్, ఇండస్ట్రియల్ పార్కులు, రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2028 జూన్ 2 నాటికి కొడంగల్లోని అన్ని రోడ్లు పూర్తి కావాలని, ప్రతి తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులను CM ఆదేశించారు.



