మూడు పెళ్లిళ్ల ట్రాప్.. రైల్వే ఉద్యోగి సూసైడ్

AP: తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన రవి రైల్వే ఉద్యోగి. మహిళా సంఘం నాయకురాలిగా చలామణి అవుతున్న ఉషారాణి మ్యాట్రిమోని సైట్ ద్వారా రవికి పరిచయమైంది. మాయమాటలతో రవిని ట్రాప్ చేసి మూడేళ్లుగా అతనితో సహజీవనం సాగించింది. రవి రైల్వే రికార్డులో, అతని రూ.1కోటి ఇన్సూరెన్స్ పాలసీకి నామినిగా పెట్టాలని ఆమె ఒత్తిడి చేసింది. రవి రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెకు మూడు పెళ్లిళ్లు అయినట్లు గుర్తించారు. మహిళా సంఘం, CPI నాయకులతో మాట్లాడి రాజీ చేసుకోవాలని పోలీసులు రవికి చెప్పినట్లు సమాచారం. తనకు న్యాయం జరగలేదని రవి సూసైడ్ చేసుకున్నాడు.




