తోటి విద్యార్థినితో పోల్చినందుకు ఆత్మహత్య

TG: గద్వాల దగ్గర కొత్తపల్లిలో ఇంటర్ చదువుతున్న తరుణ్ (18) అనే స్టూడెంట్ ఉరేసుకుని చనిపోయాడు. ఫస్టియర్లో అతనికి 434 మార్కులు రాగా, క్లాసులో మరో అమ్మాయికి 435 మార్కులు వచ్చాయి. దీంతో ఓ టీచర్ రోజూ ఆ అమ్మాయిని మెచ్చుకుంటూ, తనను అందరి ముందు తక్కువ చేసి మాట్లాడిందని తరుణ్ బాధపడ్డాడు. రెండు రోజుల క్రితం టీచర్తో గొడవపడి, కాలేజీకి వెళ్లడం మానేసి, మంగళవారం ఇంట్లో ఎవరూ లేని టైంలో లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.



