← Back to news

ఐదు రూపాయల కోసం తల్లిని చంపేశాడు !

By DS· 17 Jun 2026· jarkhand
ఐదు రూపాయల  కోసం తల్లిని చంపేశాడు !

చత్తిస్ గఢ్ లో ఓ యువకుడు ఐదు రూపాయల కోసం తల్లిని చంపేశాడు. గుట్కాకు బానిస అయిన అతగాడు తల్లిని ఐదు రూపాయలిమ్మని వత్తిడి చేశాడు. ఆమె ఇవ్వక పోవడంతో ఆమెను ఏకంగా హత్య చేశాడు. లఖన్ మాలి అనే ఆ యువకుడు తల్లి తిహ్రిన్ మాలి భోజనం వడ్డిస్తుందగా ఆమెను ఐదు రూపాయలు ఇవ్వమని వేధించాడు. ఆమె లేవని చెప్పడంతో కోపం పట్టలేక ఆమెను తీవ్రంగా కొట్టాడు. తప్పించుకుని పారిపోతున్న ఆమె తలపై రాయితో బలంగా కొట్టాడు. ఆమె మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేసి లఖన్ ఆలీని అరెస్టు చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.