క్షణాల్లో అగ్నికి ఆహుతైన దుకాణాలు

TG: నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని పుణ్యక్షేత్రం చెర్వుగట్టు గుట్టకింద అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. బొమ్మల దుకాణంలో మంటలు చెలరేగడంతో 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత ఉద్ధృతమయ్యాయి. గ్రామపంచాయతీ కార్యాలయానికీ మంటలు వ్యాపించి కీలక దస్త్రాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.2.5 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.



