← Back to news

ప్రతి ఇంట సంతోషం నిండాలి: పొన్నం

By DK· 2 Aug 2026· హైదరాబాద్
ప్రతి ఇంట సంతోషం నిండాలి: పొన్నం

తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

More in TG