← Back to news

ఒకవైపు దొంగలు..మరోవైపు పనిచెయ్యవు

By RK· 24 Jul 2026
ఒకవైపు దొంగలు..మరోవైపు పనిచెయ్యవు

TG: కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను దొంగలు రాత్రి వేళల్లో కేబుళ్లు, ఛార్జింగ్ గన్నులను ఎత్తుకెళ్తున్నారు. సీసీ కెమెరాలను కూడా పాడుచేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పెట్టిన 160 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లలో సగానికి పైగా పనిచేయడం లేదు. చాలాచోట్ల టెక్నికల్ సమస్యలు, మరికొన్ని చోట్ల చోరీలు ఇందుకు కారణం. గూగుల్ మ్యాప్స్ చూసి ఛార్జింగ్ కోసం వస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

More in TG