వెలిగొండ ప్రాజెక్టు 4 జిల్లాల తలరాతను మారుస్తుంది: CM
AP: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఏ ఒక్కరూ నష్టపోకుండా నిర్వాసితులందరినీ ఆదుకుంటామని CM చంద్రబాబు భరోసా ఇచ్చారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని ఫీడర్ కాల్వ లైనింగ్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కొత్తూరు పొలాల్లో ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారం చెక్కులు అందించారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల ప్రజల తలరాతను మారుస్తుందన్నారు. ప్రాజెక్టులో ప్రధానమైన ఫీడర్ కాల్వ లైనింగ్ పనులపై సీఎం సీరియస్ అయ్యారు. జులై చివరి నాటికి పనులు పూర్తి చేయాలని, లేదంటే సంస్థను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు.



