← Back to news

నేషనల్ హైవేపై కాంగ్రెస్ నాయకులు బైఠాయింపు

By DK· 22 Jul 2026· కామారెడ్డి జిల్లా
నేషనల్ హైవేపై కాంగ్రెస్ నాయకులు బైఠాయింపు

TG: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గేట్ వద్దనున్న హైవేపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నీట్, పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

More in TG