మెగా టూరిజం హబ్గా పోలవరం

AP: పోలవరం ప్రాజెక్టు స్పిల్వే, ECRF డ్యామ్ (Earth cum Rock Fill Dam) సుందరీకరణ డిజైన్లు తుది రూపానికి వచ్చాయి. జపాన్కు చెందిన నిప్పాన్ కోయి ఆర్కిటెక్చర్ సంస్థ ఈ డిజైన్లను రూపొందించింది. ఈ డిజైన్లపై సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని 10,000 ఎకరాల్లో టూరిజం హబ్ కోసం ఇటీవల లైడార్ సర్వే కూడా చేశారు. పోలవరం నుంచి పాపికొండలు మీదుగా భద్రాచలం వరకూ టూరిజం హబ్గా మార్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గోదావరి విశిష్టత చాటేలా మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, టెంపుల్ టూరిజం, పార్క్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.



