సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు: పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితులు!

విజయవాడలో సంచలనం రేపిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని సోమవారం ACP ఆఫీస్లో లొంగిపోయారు. సాయి కృష్ణ డెడ్ బాడీ మాయం చేయడంలో వీరిద్దరిదే కీలక పాత్ర అని నిర్ధారించిన విజయవాడ పోలీస్ కమిషనర్, ఇప్పటికే వీరిని సస్పెండ్ చేశారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న వీరు తాజాగా పోలీసులకు దొరికారు. ఇదే కేసులో కృష్ణలంక CI నాగరాజును SIT అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.



