← Back to news

మాట తప్పిన కేంద్రం- ప్రొటెస్టుల్లో పాల్గొన్న వారిపై కేసులు

By DS· 27 Jul 2026· instagram· Bihar
మాట తప్పిన కేంద్రం- ప్రొటెస్టుల్లో పాల్గొన్న వారిపై కేసులు

స్టూడెంట్స్ దీక్ష విరమించి 24 గంటలు గడవక ముందే కేంద్రం తన నైజాన్ని బయటపెట్టింది. బీహార్ లో నీట్ పరీక్షల లీకేజీకి వ్యతిరేకంగా బంద్ లాఠీ చార్జికి దారి తీసింది. ర్యాలీ తీస్తున్న స్టూడెంట్స్ ను పోలీసులు చావబాదారు. పలు జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సివాన్ లో ఏకంగా స్టూడెంట్స్ పై ఏకే 47 లతో విరుచుకు పడ్డారు. పరిస్థితిని సీజేపి లీడర్ అభిజిత్ దీప్కేకు వివరిస్తూ ఇన్ స్టాలో కంప్లయింట్లు పెరుగుతున్నాయి. నిరసనల్లో పాల్గొన్న వారిపై FIR లు కూడా నమోదవుతున్నాయి.

More in News