భర్తపై యాసిడ్ పోసిన భార్య!
కుటుంబ కలహాల కారణంగా భర్తపై భార్య బాత్రూమ్ యాసిడ్ పోసిన షాకింగ్ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో శనివారం జరిగింది. పులపకూరి అర్జున్ కుమార్ అనే వ్యక్తిపై అతని భార్య దుర్గా భవాని యాసిడ్తో దాడి చేసింది. ఈ ఇన్సిడెంట్లో తీవ్ర గాయాలపాలైన అర్జున్ను వెంటనే అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.



