భార్య ముందే గర్ల్ఫ్రెండ్తో కలిసి భర్త సూసైడ్ అటెంప్ట్!

శ్రీకాకుళం చప్పర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ శిరీష్ కుమార్కి(34) భార్య సులోచన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా అతను ఊరిలోనే ఉండే మరో మహిళతో రిలేషన్ పెట్టుకుని కోయంబత్తూర్ పారిపోయాడు. విషయం తెలిసి భార్య చుట్టాల సాయంతో వాళ్ళిద్దరినీ శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్లో హైదరాబాద్ తీసుకొస్తుండగా.. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరకు రాగానే, శిరీష్ అతని గర్ల్ఫ్రెండ్ బాత్రూమ్లో పురుగుల మందు తాగి స్పృహ తప్పడంతో రైల్వే సిబ్బంది గాంధీ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వారి కండిషన్ సీరియస్గా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు.



