← Back to news

చిన్నారుల ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడని పూజలు

By DK· 20 Jul 2026· కర్నూలు జిల్లా
చిన్నారుల ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడని పూజలు

AP: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, కరవు తొలగిపోవాలని కోరుతూ భీమా లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు చిన్నారుల చేత తలపై నీటి బిందెలను మోయించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆ పవిత్ర జలాలతో స్వామివారికి జలాభిషేకం చేశారు. ఆలయం కోట గుడిలో చిన్నపిల్లలతో పూజలు చేయడం గ్రామ ఆచారం. చిన్నారుల అమాయక ప్రార్థనలను దేవుడు త్వరగా ఆలకిస్తాడనే విశ్వాసంతో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు వారు తెలిపారు.

More in AP