IRC సదస్సు వేళ తెలంగాణకు ఘోర అవమానం

R & Bశాఖ ENC మోహన్ నాయక్.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ACB సోదాల్లో తేలింది. దేశంలో కీలకమైన 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్(IRC) వార్షిక సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. సదస్సుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతోపాటు దేశంలోని అన్నిరాష్ట్రాల మంత్రులు హాజరుకానున్నారు. సదస్సును IRC ఛైర్మన్ హోదాలో, ENC, TG RDC ఎండీగా మోహన్ నాయక్ ముందుండి నడిపించాల్సి ఉంది. సొంత రాష్ట్రంలో సదస్సు నిర్వహించి తెలంగాణ సత్తా చాటాల్సింది పోయి, ఆయనే అవినీతి కేసులో జైలుపాలు కావడం రాష్ట్ర్రానికి తీవ్ర తలవంపులు తెచ్చింది.



