కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగింది: పోచారం

TG: కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అన్నం పెట్టినవాళ్లను మర్చిపోలేనన్నారు. పదవి, డబ్బు కోసం తను పార్టీ మారలేదని, కొందరి వల్లే తను పార్టీ మారాల్సి వచ్చిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం నిధుల కోసం ఫోన్ చేస్తే ఎవరూ స్పందించడం లేదన్నారు. తను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానని తెలిపారు.



