ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్డెడ్

AP: శ్రీకాకుళం జిల్లా కవిటి మండల పరిధిలోని జమేదారిపుట్టుగ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చిన లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు తీవ్ర గాయాలతో స్పాట్లోనే మృతి చెందారు. ఆటోలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



