← Back to news

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ ఏర్పాటు

By డీకే· 21 Jun 2026· Dishadaily· అమరావతి
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ ఏర్పాటు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తుపై AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును త్వరగా ఛేదించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో ఉన్న ప్రాధాన్యత, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యున్నత పోలీస్ అధికారులతో 'సిట్' బృందాన్ని ఏర్పాటు చేశారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసును అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ఏర్పాటుచేసిన ఈ ప్రత్యేక బృందానికి (SIT) చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐజీ రవిప్రకాశ్‌ను నియమించారు.

More in AP