← Back to news

గోదావరి ఉగ్రరూపం.. గ్రామాలు జలదిగ్బంధం

By DK· 1 Aug 2026· భద్రాద్రికొత్తగూడెం జిల్లా
గోదావరి ఉగ్రరూపం.. గ్రామాలు జలదిగ్బంధం

TG: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55.60 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి ప్రభావంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంతెనలు నీటమునగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పంటలు నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

More in TG