కలెక్టర్కు జర్నలిస్టుల పిటిషన్..

నాగర్కర్నూల్లో జర్నలిస్టులు తమ సమస్యలతో కలెక్టర్ ముందుకు వెళ్లారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు.

