← Back to news

చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు

By dk· 8 Aug 2026· జయశంకర్ భూపాలపల్లి జిల్లా
చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు

TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లోని నేషనల్ హైవేపై RTC ఎలక్ట్రిక్‌ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. బస్సులో సుమారు 20మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, RTC అధికారులు ఘటన స్థలానికి చేరుకుని, వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమా, ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

More in TG