ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య

TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల రాజయ్య (45), రేణుక దంపతులు. రేణుకకు గంగాశేఖర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. అడ్డుగా ఉన్న రాజయ్యను తొలగించుకోవాలని, అంతేకాకుండా రాజయ్య చనిపోతే ఆయన పేరు మీదున్న ఇన్సూరెన్స్ సొమ్ము తమకే దక్కుతుందని ప్లాన్ వేశారు. రేణుక, గంగాశేఖర్ పథకం ప్రకారం రాజయ్యకు మద్యం తాగించి ఐరన్ రాడ్తో కొట్టి హత్యచేశారు. అనుమానం రాకుండా రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరించారు. నేరం అంగీకరించడంతో నిందితులు రేణుక, గంగాశేఖర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.



