← Back to news

భద్రాచలం వద్ద హై అలర్ట్

By DK· 31 Jul 2026· భద్రాద్రికొత్తగూడెం జిల్లా
భద్రాచలం వద్ద హై అలర్ట్

TG: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రభావంతో కల్యాణకట్ట, స్నానఘట్టాలు నీటమునిగాయి. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు ములుగు జిల్లాలో సమ్మక్క బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

భద్రాచలం వద్ద హై అలర్ట్

More in TG