లాకప్డెత్ కేసు. . స్టేషన్ టెర్రస్పై షాకింగ్ వస్తువులు

AP: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్డెత్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణలంక పోలీస్స్టేషన్ టెర్రస్పై అనుమానాస్పద మరకలున్న లాఠీతోపాటు ఎముకలు, బూడిద, స్టీల్ బ్రేస్లెట్, ఇతర వస్తువులను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తదుపరి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఇవి పోలీసు కస్టడీలో మరణించిన సాయికృష్ణకు చెందినవని సిట్ అధికారులు భావిస్తున్నారు. కోర్టుకు సమర్పించిన CI నాగరాజు కస్టడీ పిటిషన్లోనూ ఈ విషయాలను సిట్ ప్రస్తావించింది.



