సాగుపై ఫోన్లో ఆరా తీసిన మంత్రి సీతక్క

TG: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ములుగు రైతులతో ఫోన్లో మాట్లాడి వర్షాభావ పరిస్థితులు, సాగు విధానాలపై ఆరా తీశారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ సమావేశాల్లో పాల్గొంటున్నప్పటికీ తెలంగాణ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, విత్తనాల విత్తకం, పంటల ఎంపికపై రైతులకు సూచనలు చేశారు. వర్షాభావం కారణంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రప్రభుత్వం చేపట్టిన “జలసిరి” కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.



