మత్తు ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ మృతి

TG: APలోని విశాఖపట్నానికి చెందిన మొహ్మద్ ఇమాయతుల్లా, అతని కుమారుడు ఖాసిం (27) HYD పాతబస్తీలోని యాకుత్పురాలో నివాసముంటున్నారు. డాక్టర్ ఖాసీం మల్లాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తున్నాడు. రాత్రి విశ్రాంతికని ఆసుపత్రిలోని తన గదిలోకెళ్లి గడియపెట్టుకున్నాడు. ఖాసీం ఎంతసేపటికీ బయటకు రావడం లేదని ఆసుపత్రి సిబ్బంది తలుపులు విరగ్గొట్టారు. అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. తనకు నిద్ర పట్టడం లేదని ఖాసిం చెప్పేవారని ఆయన తండ్రి పోలీసులకు తెలిపారు. నిద్ర కోసం మాత్రలతోపాటు మత్తు ఇంజెక్షన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.



