భూములకు పూర్తి భద్రత.. రాజముద్రతో పాస్బుక్స్

AP: భవిష్యత్లో ప్రజల ఆస్తులను ఎవరూ ఆక్రమించకుండా, ప్రజల ఆస్తిపై ప్రజలకే సర్వహక్కులు ఉండేలా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి - మీ హక్కు’ గ్రామసభలో ఆయన మాట్లాడారు. రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. గత పాలకులు భూమి పత్రాలపైనా, సర్వే రాళ్లపైనా తమ ఫొటోలు ముద్రించుకున్నారని ఫైరయ్యారు. ఆ ఫొటోల పిచ్చిని తొలగించేలా కట్టుదిట్టమైన రాజముద్రతో పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నట్లు CM స్పష్టం చేశారు.



