ప్రాణహిత, గోదావరి నదుల ఉగ్రరూపం.. హైఅలర్ట్

TG: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రాణహిత, గోదావరి నదుల వరద పరిస్థితిని పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు <a href="https://www.theclearcutnews.com/n/ru3a7Gr">అప్రమత్తం</a>గా ఉండాలని ఆదేశించారు. మట్టి, పెంకుటిళ్లు, రేకుల ఇళ్లలో నివసించే ప్రజలు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలు లేదా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని, చేపల వేట, ఈత, స్నానాలు పూర్తిగా నివారించాలని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.



