← Back to news

చోరీ చేసి ఇంటికి నిప్పంటించారు

By DK· 10 Jul 2026
చోరీ చేసి ఇంటికి నిప్పంటించారు

AP: ఇంట్లో చోరీ చేసిన దుండగులు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ఇంటికి నిప్పంటించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో రైల్వే మహిళా ఉద్యోగి ఉమాదేవి భర్త మరణించడం, పిల్లలు చదువుల కోసం వేరే ఊరిలో ఉండటంతో ఒంటరిగా ఉంటోంది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 25తులాల బంగారు నగలు, 50తులాల వెండి, రూ.20వేల నగదును ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పుపెట్టారు. మంటలు చెలరేగి పెద్దఎత్తున వ్యాపించాయి. ఇంట్లోని దుస్తులు, బీరువాలోని డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, ఫ్రిడ్జ్, రెండు టీవీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

More in AP