← Back to news

డాక్యుమెంట్ రైటర్లకు ఆందోళన అక్కర్లేదు: చంద్రబాబు

By Mahesh· 21 Jul 2026· AP
డాక్యుమెంట్ రైటర్లకు ఆందోళన అక్కర్లేదు: చంద్రబాబు

AP: డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వం ప్రైవేటీకరిస్తున్నదని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అందులో వాస్తవం లేదని సీఎం స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సేవలు సులభతరం చేసేలా RSKలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పని చేస్తాయన్నారు.

More in AP