యువకుడు దారుణ హత్య

AP: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మూలపేట గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన రాకేష్(28) తన అమ్మమ్మ అంత్యక్రియలకు మూలపేటకు వచ్చాడు. ఓ దుకాణం వద్ద రాకేష్ చెల్లితో కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. తన చెల్లిపై ఎందుకు కామెంట్ చేశారని రాకేష్ నిలదీయడంతో ఘర్షణ జరిగింది. అమ్మమ్మ ఖననం కోసం స్మశాన వాటికకు వెళ్లిన రాకేష్పై వంశీ అనే యువకుడు, మరో నలుగురు చాకులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు.



