← Back to news

యువకుడు దారుణ హత్య

By DK· 16 Jul 2026
యువకుడు దారుణ హత్య

AP: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మూలపేట గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన రాకేష్(28) తన అమ్మమ్మ అంత్యక్రియలకు మూలపేటకు వచ్చాడు. ఓ దుకాణం వద్ద రాకేష్ చెల్లితో కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. తన చెల్లిపై ఎందుకు కామెంట్ చేశారని రాకేష్ నిలదీయడంతో ఘర్షణ జరిగింది. అమ్మమ్మ ఖననం కోసం స్మశాన వాటికకు వెళ్లిన రాకేష్‌పై వంశీ అనే యువకుడు, మరో నలుగురు చాకులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాకేష్‌ను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 18h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.