← Back to news

'అది ప్రమాదం కాదు, ప్లాన్‌తోనే నిప్పంటించాడు'

By డీకే· 21 Jun 2026· Sakshi· హైదరాబాద్‌
'అది ప్రమాదం కాదు, ప్లాన్‌తోనే నిప్పంటించాడు'

TG: మిర్యాలగూడలోని కలల్వాడ కాలనీలో ఈ నెల 5న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో వనం చంద్రమ్మ (50), ఆమె మనువడు నక్కా లక్ష్మణ్(16), మనవరాలు నక్కా ప్రణతి(14) సజీవ దహనమైన విషయం తెలిసిందే. పోలీసుల లోతైన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. అది ప్రమాదం కాదని, పెట్రోల్ పోసి తగలబెట్టి ప్రమాదంగా చిత్రీకరించారని తేల్చారు. చంద్రమ్మ పెద్ద కుమార్తె ధనమ్మకు, భర్త శిరీశ్‌కుమార్‌కు ఇల్లు నిర్మించుకునే విషయంలో ఆర్థికపరమైన గొడవలు జరిగాయి. దీంతో శిరీశ్‌కుమార్, గాఢనిద్రలో ఉన్న చంద్రమ్మ, పిల్లలు లక్ష్మణ్, ప్రణతిలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 23h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.