పెళ్ళైన 40 రోజులకే అనుమానాస్పద మృతి

AP: విజయనగరం జిల్లా మెంటాడ ప్రాంతానికి చెందిన కృష్ణవేణి(25)కి ఈ ఏడాది మే 13న తన దగ్గరి బంధువైన యాండ్రాపు మురళీతో మ్యారేజ్ అయింది. వివాహం అనంతరం విశాఖపట్నం జిల్లా PMపాలెం PS పరిధిలోని RH కాలనీలో నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మురళీ రోజూలాగే డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చేసరికి కృష్ణవేణి ఫ్యాన్కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. మురళీ పోలీసులకు సమాచారం అందించారు. ACP అప్పలరాజు, CI బాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని డెడ్బాడీని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



