మరో 2 గంటల్లో పిడుగులతో భారీ వర్షం

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం పరిధిలోని కోటబొమ్మాళి, నరసన్నపేట ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. అనకాపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది. పిడుగుల ముప్పు ఉన్నందున ప్రజలను అప్రమత్తంగా ఉండామని, చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA హెచ్చరించింది.



