ప్రశ్న రావణ్పై రాజద్రోహం కేసు

AP: ప్రముఖ యూట్యూబర్, ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్పై కృష్ణా జిల్లా గన్నవరం PSలో రాజద్రోహం కేసు నమోదైంది. జనసేన నేత గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే FIR నమోదు అయింది. ఈ కేసులో భాగంగా పోలీసులు BNS సెక్షన్ 147, 148, 152 లతో పాటు, UAPA చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు తనపై నమోదైన అన్ని కేసులను ఒకేసారి విచారించాలని రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.



