← Back to news

రేపు సాయంత్రం రావిశాస్త్రి కథా పురస్కారాల అందజేత

By విశీ· 30 Jul 2026
రేపు సాయంత్రం రావిశాస్త్రి కథా పురస్కారాల అందజేత

TG: ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి 104 వ జయంతి సందర్భంగా జులై 31న రావిశాస్త్రి కథాపురస్కారాలు అందించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నగరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ఉదయిని’ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె’ పుస్తకానికి నరేష్కుమార్ సూఫీ, ‘గోడవతల’ పుస్తకానికి స్వర్ణకిలారి, ‘బొంబాయి పొట్టేలు’ పుస్తకానికి చరణ్ పరిమి, ‘ఒంటరితనపు కథలు’ పుస్తకానికి మహమ్మద్ గౌస్ ఈ పురస్కారాలు అందుకోనున్నారు.

More in TG