గాదె సాయికృష్ణ డెత్ మిస్టరీ.. పోలీసులపై కేశినేని నాని సంచలన ఆరోపణలు!

గాదె సాయికృష్ణ మరణంపై EX MP కేశినేని నాని పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. సాయికృష్ణ ఒంటిపై ఉన్న థర్డ్ డిగ్రీ గాయాలు బయటపడకుండా ఉండేందుకే, పోలీసులు రహస్యంగా దహనం చేశారని ఆరోపించారు. ఫోరెన్సిక్, DNA లాంటి ఎలాంటి ఎవిడెన్స్ దొరక్కుండా ఉండేందుకే అస్థికలను కృష్ణానదిలో కలిపేశారని నాని అన్నారు. ఈ విషయంలో 'కమాండ్ రెస్పాన్సిబిలిటీ' కింద NTR జిల్లా పోలీస్ కమిషనర్ S.V రాజశేఖర బాబును వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.






