దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది: మంత్రి ఉత్తమ్

TG: ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. 65.91 లక్షల ఎకరాల్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందని, 52 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కేంద్రం చెప్పిందని అన్నారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. దేశంలో పండే వరిలో 61 శాతం తెలంగాణలోనే ఉందన్నారు.



