PoKలో 20 మంది ప్రాణాలు బలిగొన్న పాకిస్థాన్ భద్రతా బలగాలు

PoKలో ఎన్నికలను బహిష్కరిద్దామని నిరసనలు చేస్తున్నవారిపై పాకిస్థాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. 24 గంటల్లో 20 మంది చనిపోయారని, 50 మందికిపైగా గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. జూన్ 5 నుంచి ఇప్పటివరకు 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంటున్నారు. ఈ వివరాలను పూర్తిగా ధృవీకరించలేదు. ప్రస్తుతం PoKలో భారీ భద్రత, ఇంటర్నెట్ ఆంక్షల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.


