వాగులు, వంతెనల వద్ద భద్రత కట్టుదిట్టం

TG: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం <a href="https://www.theclearcutnews.com/n/oGAcrp9">హైఅలర్ట్</a> ప్రకటించింది. జిల్లా ఎస్పీ నితికా పంత్ కాగజ్నగర్ పెద్దవాగు, దహెగాం, పెంచికల్పేట్ ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. వాగులు, వంతెనల వద్ద పోలీసులు, SDRF బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, తాళ్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లొద్దన్నారు.



