చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్య

AP: ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామంలోని భారతి అనే మహిళ తన పిల్లలిద్దరినీ చంపి, తాను ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో "నా చావుకు ఎవరూ కారణం కాదు" అని భారతి రాసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



