APలో UAE ఫుడ్ క్లస్టర్కు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్లో UAE ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో కుదిరిన ఒప్పందం మేరకు యూఏఈ ప్రభుత్వం APలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించేందుకు ముందుకు వచ్చింది. అమరావతిలోని సచివాలయంలో CM చంద్రబాబు, UAE మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో APEDB అవగాహన ఒప్పందం కుదిరింది. మామిడి, అరటి, కోకో వంటి ఉద్యాన పంటలకు వ్యాల్యూ యాడెడ్ చైన్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. తొలిదశలో రూ.100 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది.



