రోహిత్ వేముల చట్టాన్ని అమల్లోకి తెస్తాం

TG: రాష్ట్రంలో రోహిత్ వేముల బిల్లు అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ బిల్లుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయిందని, డిగ్రీ కాలేజెస్, యూనిర్సిటీల్లో వివక్ష రూపుమాపేందుకు రోహిత్ వేముల చట్టాన్ని అమల్లోకి తీసుకు వస్తామని ప్రకటించారు. ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి తుది రూపమిస్తామని పేర్కొన్నారు. ముసాయిదా బిల్లును త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు భట్టి తెలిపారు. త్వరలోనే రోహిత్ వేముల బిల్లును అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామన్నారు.



