← Back to news

మళ్లీ హాస్టల్‌కు పంపుతారనే భయంతో బాలిక ఆత్మహత్య

By dk· 12 Aug 2026· ఆదిలాబాద్ జిల్లా
మళ్లీ హాస్టల్‌కు పంపుతారనే భయంతో బాలిక ఆత్మహత్య

TG: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామానికి చెందిన 11ఏళ్ల బాలిక మైనారిటీ హాస్టల్‌లో 5వ తరగతి చదువుతుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రేషన్‌కార్డు eKYC కోసం పదిరోజుల క్రితం తల్లి ఆమెను ఇంటికి తీసుకొచ్చింది. అయితే తిరిగి హాస్టల్‌కు వెళ్లేందుకు బాలిక ఇష్టపడకపోవడంతో, ఆమెను హాస్టల్ నుంచి మాన్పించి TC తీసుకురావడానికి తల్లి అక్కడికి వెళ్లింది. ఈ సమయంలో బాలిక ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. తిరిగి హాస్టల్‌కు పంపిస్తారనే భయంతోనే ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

More in TG