← Back to news

కేంద్ర మంత్రి దోసకాయ సాగుకు రూ.99 లక్షల సబ్సిడీ

By Vishi· 28 Jul 2026· Indianexpress
కేంద్ర మంత్రి దోసకాయ సాగుకు రూ.99 లక్షల సబ్సిడీ

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి తన శాఖ పథకం ద్వారా తన పొలానికి రూ.99 లక్షల సబ్సిడీ పొందారు. చౌదరి 16,592 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దోసకాయ సాగు చేస్తున్నారు.2025లో నేషనల్ హార్టికల్చర్ బోర్డు ‘హార్టికల్చర్ పంటల ఉత్పత్తి, పోస్ట్-హార్వెస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా వాణిజ్య హార్టికల్చర్ అభివృద్ధి’ పథకం కింద ఆమోదించిన 467 ప్రాజెక్టులలో ఇదీ ఒకటి. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సబ్సిడీని ఆయన తిరిగి ఇచ్చేసినట్టు పార్లమెంటులో మరో మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ చెప్పారు.

More in India