← Back to news

సెల్‌ఫోన్ గొడవ.. బాలిక సూసైడ్

By DK· 17 Jul 2026· కర్నూలు జిల్లా
సెల్‌ఫోన్ గొడవ.. బాలిక సూసైడ్

AP: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన జేమ్స్ కుమార్తె లావణ్య (15) స్థానిక ZPHSలో 9వ తరగతి చదువుతోంది. ఆమె అన్న చరణ్ కూడా అదే స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల ముగిసిన తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చి సెల్ ఫోన్ వాడుకునే విషయంలో గొడవ పడ్డారు. తల్లిదండ్రులు లావణ్యను మందలించారు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక క్షణికావేశంలో పక్కనే ఉన్న తన అవ్వ ఇంటికి వెళ్లింది. అక్కడ చిన్నపిల్లల కోసం కట్టిన చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 17h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.