సెల్ఫోన్ గొడవ.. బాలిక సూసైడ్

AP: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన జేమ్స్ కుమార్తె లావణ్య (15) స్థానిక ZPHSలో 9వ తరగతి చదువుతోంది. ఆమె అన్న చరణ్ కూడా అదే స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల ముగిసిన తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చి సెల్ ఫోన్ వాడుకునే విషయంలో గొడవ పడ్డారు. తల్లిదండ్రులు లావణ్యను మందలించారు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక క్షణికావేశంలో పక్కనే ఉన్న తన అవ్వ ఇంటికి వెళ్లింది. అక్కడ చిన్నపిల్లల కోసం కట్టిన చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.



